ప్రముఖ సినీ నటి జయసుధ రాజకీయాల మీద అనురక్తి పెంచుకున్నట్లే కనిపిస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న ఆమె పలుమార్లు రాజకీయాలంటే విరక్తి కలిగినట్లుగా మాట్లాడారు.వచ్చే ఎన్నికలలో పోటీచేయరాదన్నట్లుగా మాట్లాడేవారు. అలాంటిది ఇప్పుడు సడన్ గా మారిన రాజకీయ వాతావరణంలో మరోసారి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతూ ఆమె ప్రజలలో పర్యటిస్తున్నారు.నిజంగా రాజకీయాల మీద ఆసక్తి లేకపోతే జయసుధ నియోజకవర్గంలోని కాలనీలలో పర్యటనలు చేసేవారు కారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఊరుకునేవారు.కాని ఆమె ఇప్పుడు మళ్లీ క్రియాశీలం అయినట్లు కనిపిస్తున్నారు.
పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీని మరోసారి ప్రజలు బలపరచాలని జయసుధ అన్నారు. సికింద్రాబాద్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం మెట్టుగూడ డివిజన్లో రాహుల్ యువజనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ చేసిన వివిద కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు. మొత్తం మీద జయసుధ మళ్లీ పోటీచేస్తారని అనుకోవచ్చా!
0 Reviews:
Post a Comment