

వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీలో శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్ ,కొండా సురేఖ, అంబటి రాంబాబు, గ ట్టు రామచంద్రరావు వంటి నాయకులు మీడియా సమావేశాల్లో సీబీఐ జేడినే లక్ష్యం గా చేసుకుని విమర్శలు చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. తనపై ఎవరూ ఎన్ని విమర్శలు చేసినా ఎన్నిసార్లు విమర్శలు చేసినా లక్ష్మీ నారాయణ వాటికి స్పందించేవారు కాదు. చట్టం తన పని తాను చేసుకుపో తుందన్న తరహాలో తనపై వచ్చే విమర్శలకు చిరునవ్వే సమాధానంగా చెప్పేవారు. రాష్ట్రం లో దివంగత వైఎస్ కుటుంబానికి ప్రత్యేకించి జగన్ వర్గీ యులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన లక్ష్మీ నారాయణ బడిలీ వార్త జగన్ శిబిరంలో ఆనందోత్సాహా లను నింపుతోంది. పలువురు వైస్ఆర్కాంగ్రెస్పార్టీ నాయ కులు బదిలీపై సంబరాలు చేసుకున్నట్టు సమాచారం.
courtesy: suryaa
0 Reviews:
Post a Comment