Contact us

కిస్మిస్ , ఎండుద్రాక్ష ఉపయోగాలు


కిస్మిస్ , ఎండుద్రాక్ష



ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిఅయ్యే ద్రాక్షలో 80 శాతం పంటను వైన్ తయారీలో వాడుతారు. ఏడు శాతాన్ని ఎండు ద్రాక్షగా మలుస్తారు. మిగిలిన, శాతాన్ని మాత్రమే తాజాగా తినడానికి గాని జ్యూస్ తీసి వాడుకోవటానికి గాని వాడుతారు. మంచి పోషకాహర విలువలు కలిగి ఉం టాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి 



సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తింటే అండాశయములోని లోపాలు తొలగి సంతానము కలుగుతుంది. మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్ పండ్లు తినుటవలన యూరినల్‌లో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.






కిస్‌మిస్ పండ్లను తరుచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది. 200 మిల్లిగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్‌మిస్ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. 



అలాగే రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి పది కిస్‌మిస్ పండ్లను నీళ్ళలోవేసి బాగా వుడకబెట్టి గుజ్జుగా వేసి తాగడం చేయాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటే వారికి వారంపాటు ప్రతిరోజూ రాత్రిపూట రెండు ఎండు ద్రాక్ష పొలుకులను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటునుంచి ఉపశమనం కలుగుతుంది.



 గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది . ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. దీంతో ఉపశనం కలుగుతుంది మలబద్దకంతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతోబాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకంనుంచి ఉపశమనం కలుగుతుంది. 



ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతా యి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తం లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్ర్తీల కు ఇది ఎంతో ఉపయోగం.


1.దంత రక్షణ : ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బాక్టీరియా ను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది . 

2.కండ్ల కు మంచిది : ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ ఫైటో నూట్రియంట్శ్ మూలాన యాంటీఅక్షిడెంట్ గా పనిచేస్తుంది . బీటాకెరొటీన్‌ , కెరొటనోయిడ్స్ కళ్ళకు మంచిది . 


3.ఎముకులకు రక్షణ : కాల్సియం , బోరాన్‌ ఎముకలు తయారీకి , గట్టిపడడానికి ఉపయోగ పడుతుంది .


 4.సెక్షువల్ వీక్నెస్ : లిబిడో ను ఎక్కువ చేసే అమినో యాసిడ్ ఆర్జినిన్‌ ఇందులో ఉన్నది. దాంపత్య జీవితం లోని నిరాస నప్రుహలను తొలగించును .

 5.జ్వరము : ఫినోలిక్ ఫైటోన్యూట్రియంట్స్ జెర్మిసైడల్ గా పనిచేయును . మంచి యాంటీఅక్షిడెంట్ గా పనిచేయుటవల ఫీవర్ తగ్గే అవకాశము ఉంది .

 6. రక్తహీనత : ఒక మోతాదులో ' ఐరన్‌ ' & బీకాంప్లెక్ష్ ,కాపర్ ... కిస్మిస్ లో ఉన్నందున రక్తహీనతను సరిచేయును .

 7. ఎసిడోసిస్ : ఇందులో ఉన్న పొటాసియం , మెగ్నీషియం పుష్కలముగా లబించును కావున ఎసిడోసిస్ రాకుండా నియంత్రించును .

 8. శరీర బరువు : కిస్మిస్ లో ఉన్న ఫ్రక్టోజ్ , గ్లూకోజ్ అధిక శక్తిని ఇచ్చి బరువును పెంచే దిశగా శక్తి మూలకముగా పనిచేయును . తక్కువ బరువు గల వ్యక్తులు డ్రై ఫ్రూట్స్ గా ఎండుద్రాక్షను తింటే మంచిది . 

 9. మలబద్దకం : ఎండు ద్రాక్షలో ఫిబర్ పుష్కలముగా ఉన్నందున విరోచనము సాఫీగా జరుగును . మలబద్ద్కం ఉన్నవారు కిస్మిస్ తింటే సరిపోతుంది
సోర్స్;వికీపీడియా





బాదం, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికే కాదు.. గుండెకు ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.


బాదం : బాదం పప్పులో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం, రాగి వంటి ఖనిజ లవణాలు ఇ విటమిన్ పుష్కలంగా లభిస్తాయి. రోజూ బాదం పప్పలు తింటే శరీరంలో హానికర కొవ్వునిల్వలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉండే ఫోలేట్, ఇతర బి విటమిన్లు పుట్టుకతో వచ్చే లోపాలను నిరోధిస్తాయి.

వాల్‌నట్స్ : ఒమెగా-3 ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అధిక రక్తపోటునూ హానికర కొలెస్ట్రాల్ స్థాయిల్ని నియంత్రిస్తుంది. వీటికుండే యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు ఒత్తిడి, ఆందోళన వంటివాటి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంపొందింపజేస్తాయి. కొన్నిరకాల క్యాన్సర్లను నిరోధిస్తాయి.

ఎండుద్రాక్ష : వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం ఎముకలపై దుష్ప్రభావం చూపి ఆస్టియోపోరోసిస్‌కి దారితీస్తుంది. అలాకాకుండా, ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించే బోరాన్ అనే ఖనిజలవణం ఎండు ద్రాక్షలో లభ్యమవుతుందని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.
అధిక ప్రోటీనులున్న ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడం సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అలాంటి హై ప్రోటీన్స్ డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. వీటిలో హై ప్రోటీన్సే కాకుండా క్యాలరీలు, పోషకవిలువలు, ఫైబర్ కలిగి ఉంది. అందువల్ల రెగ్యులర్ డైట్‌లో ఎండుద్రాక్ష, బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటి వాటిని చేర్చుకోండి.



ఒక కప్పు ఎండు ద్రాక్షలో 449 క్యాలరీలు, అలాగే మరో కప్పు బాదంలో 529క్యాలరీలు ఉన్నాయి. ఇటువంటి పోషక విలువలున్న డ్రై ఫ్రూట్స్‌ను పెరుగు లేదా ఐస్ క్రీమ్, సలాడ్లు ధాన్యాల మీద గార్నిషింగ్‌గా వేసుకొని తీసుకోవచ్చు.

శరీరంలో ప్లేట్ లెట్ లెవల్స్‌ను పెంచుకోవాలంటే? రోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రుచికరమైన డ్రై ఫ్రూట్స్‌లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్ లెట్ లెవల్స్‌ను సహజంగా పెంచుకోవచ్చు.

అలాగే ఐరన్ పుష్కలంగా కలిగిన ఆప్రికాట్‌ను రోజుకు రెండుసార్లు తీసుకోవడం ద్వారా ప్లేట్ లెట్ లెవల్స్‌ను పెంచుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. ఇదేవిధంగా ప్లేట్ లెట్స్‌ను పెంచుకోవాలంటే..? ఎండు ఖర్జూరం, వెల్లుల్లి, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ ను అభివృద్ది పరచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సోర్స్:webdunia

0 Reviews:

Post a Comment