హైదరాబాద్లో సభ జరిపి తీరుతాం
మరో వైపు హైదరాబాద్లో సమైక్య సభ నిర్వహించడానికి ఎపిఎన్జీవోలు సిద్ధమవుతున్నారు. సభకు సంబంధించిన అనుమతి కోసం గురువారం ఎన్జివో నేతలు పోలీసు అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఎపిఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్బాబు మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సమైక్య సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈనెల 26 లేదా 27 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను గుర్తు చేసేందుకు జాతీయ నాయకులను కలుస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్లో సమైక్యాంధ్ర సభ నిర్వహించడం తప్పయితే, రాష్ట్ర విభజన కూడా తప్పేనని అశోక్బాబు పేర్కొన్నారు. సమైక్యాంధ్రపై కేంద్రం ప్రకటన చేసే వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఆన్లైన్లో అన్ని రిజిస్ట్రేషన్ సేవలను నిలిపివేయాలని ఆయన కోరారు.
సిఎంతో భేటీ
అంతకు ముందు ఉదయం ఎన్జివో నేతలు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో సమావేశమయ్యారు. ఎపి ఎన్జీవోల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా హైదరాబాద్లో ఎన్జీవోల సభకు ఇప్పటి వరకూ పోలీసు శాఖ నుంచి ఎలాంటి హామీ, అనుమతి లభించలేదు. కాని ఎపిఎన్జీవోలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్లో సభ నిర్వహించి తీరుతామని పట్టుదలతో ఉన్నారు.
0 Reviews:
Post a Comment