
జగన్ పై ఇంతవరకు ఎందుకు కేసు పెట్టారో తేల్చుకోలేకపోతున్నారని, జగన్ జననేతగా ఎదుగుతుంటే, కాంగ్రెస్,టిడిపిలు దుకాణాలు మూసివేసుకోవాలని భావించి సిబిఐని ఉసి కొల్పారని అన్నారు. కోర్టు నోటీసులు ఇచ్చినప్పుడు జగన్ ఏభై రెండో ప్రతివాది అని ,కాని కేసు వచ్చేసరికి మొదటి నిందితుడుగా సిబిఐ పెట్టిందని,దాంతోనే సిబిఐ తీరు అర్ధం అయిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పెరట్లో గుంటనక్క అని అనాలా?కాంగ్రెస్ కుక్క లా మారిందని ఆమె అన్నారు.విచారణ జరపవలసింది సిబిఐమీదనా, కాంగ్రెస్ పైనా, కుమ్మక్కయిన చంద్రబాబు పైనా అని షర్మిల ప్రశ్నించారు.చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నందున ఆయనపై కేసులు విచారణకు రాకుండా చేయడం క్విడ్ ప్రో కో కాదా అని షర్మిల ప్రశ్నించారు.జగన్ బోనులో ఉన్నా సింహమేనని అన్నారు. ఆయనను ఆపడం కాంగ్రెస్,టిడిపిల వల్ల కాదని షర్మిల స్పష్టం చేశారు.పాదయాత్రలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు తెలిపారు.
0 Reviews:
Post a Comment