Contact us

టి.ప్రకటిస్తే పెరేడ్ మైదానంలో మిలియన్ మార్చ్
తెలంగాణపై కేంద్రం ముందుకు వెళితే హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ జరుగుతుందని ఎపి ఎన్.జిఓ సంఘం అద్యక్షుడు అశోక్ బాబు ప్రకటించారు.పేరేడ్ గ్రౌండ్స్ లో ఇది జరుగుతుందని అన్నారు. ఇది తాను హెచ్చరికగా చెప్పడం లేదని, ప్రజల ఆందోళనను తెలియచేస్తునన్నానని అన్నారు. తనకు ఏడుకొండలు స్వామి కలలోకి వచ్చి నువ్వు రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోతున్నావని బాధపడుతున్నావని, కాని నాకు అరవై ఏళ్లుగా ఆ నిద్ర కూడా ఉండడం లేదని, సమ్మె పుణ్యమా అని తనకు నిద్రపోయే అవకాశం వచ్చిందన్నారని చమత్కరించారు.డాక్టర్ మిత్ర మాట్లాడుతూ హైదరాబాద్ అందరిదని, దీనిని ఎవరూ విడగొట్టలేరని అన్నారు.

komineni

0 Reviews:

Post a Comment