
తెలంగాణ లో కొన్ని చోట్ల ఎన్..టి.ఆర్.,వై.ఎస్.విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలు చూశాం.కాని కోస్తాలో కూడా ఇలాంటి ఘటన జరగడం ఆశ్చర్యంగానే ఉంది.గుంటూరు జిల్లా చెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలో ఎన్.టి.ఆర్.విగ్రహంపై కొందరు దుండగులు పెట్రోలు పోసి నిప్పటించారు. ఇది ఏమైనా స్థానిక వివాదం కారణంగా జరిగిందా అన్నది తెలియవలసి ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు దీనికి నిరసనగా భైటాయింపు ఆందోళన జరిపారు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొమ్మినేని :
0 Reviews:
Post a Comment