Contact us

నా భర్త హత్యకు జగన్ కుట్ర
రాజారెడ్డి హత్యకేసు ఖైదీ సుధాకర్‌రెడ్డి భార్య రమణమ్మ
కలకలం సృష్టిస్తున్న విశాఖ సెంట్రల్ జైలు సంఘటన
విశాఖపట్నం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): విశాఖ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న తన భర్తను అంతమొందించేందుకు వైఎస్ జగన్, అతని తల్లి విజయలక్ష్మి, మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి కలిసి కుట్రపన్నారని వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ముద్దాయి సుధాకర్‌రెడ్డి భార్య రమణమ్మ ఆరోపించారు. తోటి ఖైదీ దాడిలో గాయపడి కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్న సుధాకర్‌రెడ్డిని పరామర్శించేందుకు రమణమ్మ ఇతర బంధువులు మంగళవారం విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా రమణమ్మ 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు. రాజారెడ్డి హత్య కేసుతో ఎలాంటి సం
బంధం లేకపోయినా రాజకీయ కక్షతో తన భర్తను ఇరికించారని ఆమె ఆరోపించారు. విశాఖ జైలు అధికారులు కూడా కుట్రదారులకు సహకరిస్తున్నారని, ఇక్కడే ఉంచితే తనభర్త ప్రాణానికి ముప్పుతప్పదని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు.. రాజారెడ్డి హత్య కేసులో ముద్దాయిగా జీవిత ఖైదు అనుభవిస్తున్న సుధాకర్‌రెడ్డిపై విశాఖ కేంద్ర కారాగారంలో తోటి ఖైదీ దాడికి పాల్పడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సంఘటన జరిగి నాలుగు రోజులైనా దాడి ఎందుకు జరిగిందన్న విషయాన్ని ఇటు జైలు అధికారులు గానీ, అటు పోలీస్ అధికారులుగానీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రాజారెడ్డి హత్య కేసులో 13వ నిందితుడిగా జీవిత ఖైదు అనుభవిస్తున్న సుధాకర్ రెడ్డి కడప జైలులో సెల్‌ఫోన్ వినియోగిస్తూ అక్కడి అధికారులకు పట్టుబడడంతో క్రమశిక్షణ చర్య కింద మూడు నెలల క్రితం విశాఖ పంపించారు. ఇక తల్లిని హత్య చేసి రాజమండ్రి కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న శంకర్ జైల్లో మద్యంసేవించి గొడవచేయడంతో అక్కడి అధికారులు పది రోజుల కిందట ఇక్కడికి తరలించారు. ఈనెల 18న సుధాకర్‌రెడ్డిపై శంకర్ గార్డెనింగ్ పనులకు వాడే కట్టర్‌తో దాడికి పాల్పడడం కలకలం సృష్టించింది.
ఈ దాడి వెనుక ఏదైనా పథకం వుందా?, సుధాకర్‌రెడ్డిని అంతమొందించే కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శంకర్‌కు జైలు సిబ్బంది నుంచి సహకారం లభించి వుంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సుధాకర్‌రెడ్డిని హత్య చేయాలని ఒక అధికారి చెప్పాడని ఒకసారి, జైల్లో ఖైదీల వద్ద క్రేజ్ పెంచుకునేందుకు చేశానని మరోసారి.. పొంతన లేకుండా శంకర్ సమాధానాలు చెప్పాడని జైలు అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా దాడి జరిగిన విషయాన్ని జైలు అధికారులు, కేజీహెచ్ వైద్యులు తమ వద్ద దాచిపెట్టారని, ఒకరోజు తర్వాత అసలు విషయాన్ని తెలుపుతూ తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు పేర్కొంటుండడం జైలు అధికారుల పాత్రపై సందేహాలకు దారితీస్తుంది. దాడి జరిగినట్టు ఫిర్యాదు అందిన తర్వాత శంకర్ ను విచారించేందుకు పోలీసులు జైలుకు వెళ్లగా అప్పటికే శంకర్‌ను క్రమశిక్షణ చర్యపేరుతో వరంగల్ జైలుకు తరలించడం అనుమానాలకు బలాన్ని చేకూర్చుతోంది. కాగా కేజీహెచ్ వైద్యుల వద్ద తాము విషయాన్ని దాచిపెట్టలేదని, ఎంఎల్‌సీ కింద ఎవరైనా చేరితే సంబంధిత పోలీసులకు వారే సమాచారం ఇస్తారని భావించడం వల్లే ఫిర్యాదు చేయడంలో కాస్త జాప్యం జరిగిందని జైలు సూపరింటెండెంట్ ఐ.శ్రీనివాస్ తెలిపారు.
శంకర్‌ను క స్టడీకి కోరుతూ నేడు పీటీ వారెంట్ పిటిషన్
సుధాకర్‌రెడ్డిపై దాడికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శంకర్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఆరిలోవ పోలీసులు కోర్టులో పీటీవారెంట్ పిటిషన్ వేయనున్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/56651#sthash.uIYuVS7H.dpuf

0 Reviews:

Post a Comment