Contact us

స్టాలిన్ కు భద్రత పెంచండి
ప్రధాని గారూ.. స్టాలిన్ కు భద్రత పెంచండి
చెన్నై: తమిళనాట డీఎంకే రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. తన కుమారుడు స్టాలిన్ కు భద్రత పెంచాల్సిందిగా డీఎంకే చీఫ్ కరుణానిధి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరారు. కరుణానిధి ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు.

స్టాలిన్ మూడు నెలల్లో చనిపోతాడు అంటూ మరో కుమారుడు అళగిరి తనతో అన్నాడంటూ కరుణానిధి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. అందుకే అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందిస్తూ.. 'పుట్టిన ప్రతివాళ్లూ ఏదో ఒకరోజు చావాల్సిందే' అనడం విపరీతార్థాలకు దారితీసింది. అళగిరి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టాలనే స్టాలిన్ ఇలా వ్యాఖ్యానించారట. తన గురించి అన్నయ్య అళగిరి చేసిన వ్యాఖ్యలను తాను సీరియస్ గా తీసుకోవట్లేదని చెప్పారు.

0 Reviews:

Post a Comment