Contact us

గతంలో ఓ స్త్రీ రేపు రా...ఇప్పుడు బాబు ఇక రాకు
'గతంలో ఓ స్త్రీ రేపు రా...ఇప్పుడు బాబు ఇక రాకు'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. 'బ్రింగ్ బ్యాక్ బాబు' పేరుతో టీడీపీ కొత్త ప్రచారానికి తెరలేపిందని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వాయిదా అనంతరం భూమన మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబుది రాక్షస పాలని అని.... తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న ఆయన ప్రజలకు ఏం చేశారని అధికారం కట్టబెట్టాలని ప్రశ్నించారు. 'గతంలో దెయ్యాలొస్తాయన్న భయంతో.... ఓ స్త్రీ రేపు రా...అని రాసుకునేవారు...ఇప్పుడు చంద్రబాబు నువ్వు ఇక రాకు' అనే పరిస్థితులు వచ్చాయని భూమన అన్నారు.

చంద్రబాబు దుష్టపాలన మళ్లీ రాకూడదని ప్రజలు పూజలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో రూల్ 77, 78 కింద సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పట్టుబడుతోందని భూమన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే అంశాన్ని మరోసారి స్పీకర్ కు గుర్తు చేశామన్నారు. కాగా ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలంటూ వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి....నిరసన తెలపటంతో స్పీకర్ సమావేశాలను 15 నిమిషాలు వాయిదా వేశారు.

0 Reviews:

Post a Comment