హిందూపురం కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ అంబిక లక్ష్మినారాయణ, తెలుగుదేశం పార్టీలోకి జంపైపోవాలని ఉబలాట పడుతున్నారు. అయితే ఆయన ఓబులాపురం అక్రమ గనుల తవ్వకాల కేసులో అరెస్టయ్యి జైలుకి వెళ్ళిన గనులశాఖ డైరెక్టర్ రాజగోపాల్ కి బావమరిది కావడంతో స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు ఆయనని పార్టీలో చేర్చుకోవడానికి అభ్యంతరం చెపుతున్నారు. కానీ, లక్ష్మినారాయణ మాత్రం తెదేపాలోకి మారేందుకు గట్టిగానే కృషి చేస్తున్నట్లు సమాచారం. ఆయన గత ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ మీద హిందూపురం నుండి పోటీ చేసారు, కానీ తెదేపా అభ్యర్ధి అబ్దుల్ ఘనీ చేతిలో ఓడిపోయారు. ఈసారి సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఏమీ బాగుండకపోవడంతో ఏకంగా తెదేపాలోకే జంపైపోవడం సేఫ్ అనుకొన్నారేమో, తెదేపా టికెట్ కోసం కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డితో కలిసి చంచల్ గూడా జైలులో చాలాకాలం సహవాసం చేసిన రాజగోపాల్ సైతం వచ్చే ఎన్నికలలో ఉరవకొండ శాసనసభ నియోజక వర్గం నుండి పోటీ చేయాలని ఉబలాటపడుతున్నట్లు సమాచారం. కానీ, ఆయన మాత్రం వైకాపా టికెట్ పైనే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బావ బావమరుదులిద్దరూ వచ్చే ఎన్నికలలో రాజకీయ ప్రత్యర్దులవుతారేమో!
teluguone
.jpg)
0 Reviews:
Post a Comment