
తెలుగు కాకుండా వేరే భాషలకు చెందిన న్యూస్ చానల్స్లో 100%, అలాగే వేరే భాషలకు చెందిన వినోద చానల్స్లో 50% వాటాను నెట్వర్క్ 18 కొనుగోలు చేసింది. తెలుగు చానల్స్లో 24.5% వాటా నెట్వర్క్ 18 పరమయ్యింది. మార్గదర్శి వ్యవహారంతో చిక్కుల్లోపడ్డ రామోజీరావును ఆదుకోవటానికి షెల్ కంపెనీల ద్వారా రూ.2,600 కోట్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈటీవీ గ్రూపులో పెట్ట డం తెలిసిందే. ఆ విషయాన్ని మూడేళ్లపాటు గోప్యంగా ఉంచాక, సాక్షి బయటపెట్టాక... కోర్టులో రిలయన్స్ అంగీకరించింది. రిలయన్స్కు ఆ డబ్బు చెల్లించకుండా రిలయన్స్తో జట్టుకట్టిన నెట్వర్క్-18కు ఈటీవీ తన చానెళ్లలో వాటాను విక్రయించింది.
0 Reviews:
Post a Comment