Contact us

ఆస్తులు అమ్మైనా మాట నిలబెట్టుకుంటా!

నంద్యాల, న్యూస్‌లైన్ :  ఆస్తులు అమ్మైనా సరే పట్టణ ప్రజలకు ఇచ్చిన 10 వేల ఇళ్ల నిర్మాణాల హామీని అపార్ట్‌మెంట్ పద్ధతిలో నిర్మించి తీరుతానని వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల సమన్వయకర్త భూమా నాగిరెడ్డి అన్నారు.   పద్మావతినగర్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో పేదల నుంచి సమస్యలపై దరఖాస్తుల స్వీకరణను సోమవారం భూమా ప్రారంభించారు. అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పార్టీ కార్యాలయం ఆవరణ కిక్కిరిసిపోయింది. మొదటి రోజు ఆరు వేల మంది వరకు వచ్చి దరఖాస్తులను అందజేశారు. భూమా స్వయంగా రంగంలోకి దిగి దరఖాస్తులను స్వీకరిస్తూ సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం భూమా మాట్లాడుతూ ఈ కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో తమ పార్టీ ముందుంటుందన్నారు. మహానేత నిత్యం పేదల అభివృద్ధినే కోరేవారని, ఆయన తనయుడు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పేదల కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నంద్యాల పట్టణ ప్రజల సమస్యల పరిష్కరించడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. కొందరు అపార్ట్‌మెంట్ నిర్మాణాలకు అభ్యంతరాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని శిల్పాను విమర్శించారు.

0 Reviews:

Post a Comment