Contact us

జంతర్ మంతర్ వద్ద జగన్ దీక్ష
సమైక్య ఫ్లకార్డుతో వెల్ లోకి దూసుకెళ్లిన జగన్
న్యూఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ మరోసారి సమైక్యవాదాన్ని చాటి చెప్పింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్  రెడ్డి బుధవారం లోక్‌సభలో సమైక్యవాదాన్ని వినిపించారు. జగన్ సమైక్య ఫ్లకార్డ్‌తో వెల్‌లోకెళ్లి నిరసన తెలియజేశారు. రాష్ట్రాన్ని సమైక్య ఉంచాలంటూ పార్టీ ఎంపీలతో కలిసి నినాదాలు చేశారు.  

మరోవైపు అడ్డగోలు విభజనను  వ్యతిరేకిస్తూ రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ అలుపెరుగని పోరాటాలు చేసిన వైఎస్‌ఆర్ సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఢిల్లీ వేదికగా సమైక్య పోరాటం చేయాలని  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జంతర్ మంతర్ వద్ద జగన్ దీక్ష చేపట్టనున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం జగన్ నేతృత్వంలో పార్టీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు.

0 Reviews:

Post a Comment