Contact us

'బీజేపీది యూ టర్న్‌ కాదు..తెలంగాణ టర్న్'
'బీజేపీది యూ టర్న్‌ కాదు..తెలంగాణ టర్న్'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీజేపీ వైఖరి మారదు అని కిషన్‌రెడ్డి తెలిపారు. మాజీ ఎంపీ ఆత్మచరణ్‌రెడ్డి, వోరేం జయచందర్‌ లు బీజేపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ...'బీజేపీది యూ టర్న్‌ కాదు..తెలంగాణ టర్న్' అని వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణ విషయంలో పూటకో మాట మాట్లాడుతూ.. తమ వైఖరి మార్చుకున్న పార్టీలు బీజేపీని విమర్శించడం సిగ్గుచేటు అని కిషన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ అంశాన్ని సాకుగా తీసుకుని కాంగ్రెస్‌ నేతలు సుష్మాస్వరాజ్‌ను విమర్శిస్తే ఖబర్దార్ అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

0 Reviews:

Post a Comment